గణనాధుని పండగ ఉత్సాహంగా జరుపుకుంటున్నారు తెలుగు ప్రజలు. ఈసారి వినాయకచవితి తిథి విషయంలో గందరగోళం ఉండడంతో సోమవారం, మంగళవారం కూడా వినాయకచవితి ఉత్సవాలు జరగనున్నాయి. చాలా ప్రాంతాల్లో సోమవారం సాయంత్రమే వినాయకుడు కొలువుతీరాడు. ముఖ్యంగా తెలంగాణాలోని చాలా ప్రాంతాలలో సోమవారం పండగ చేసుకున్నారు. ఈ నేపధ్యంలో సీఎం కేసీఆర్ (CM KCR) దంపతులు ప్రగతి భవన్ లో వినాయకచవితి పూజలు నిర్వహించారు. సోమవారం ఉదయమే జరిగిన పూజల్లో సీఎం దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలందరికీ వినాయకచవితి శుభాకాంక్షలు తెలిపారు సీఎం కేసీఆర్. విఘ్నేశ్వరుడు రాష్ట్ర ప్రజలను చల్లగా చూడాలనీ.. అందరికీ సుఖశాంతులు కాలగాలనీ ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ దంపతులు, వారి కూతురు అలేఖ్యలతో పాటు మంత్రి శీనివాస్ గౌడ్, ఎమ్మెల్సీ రాజేశ్వర్ రెడ్డి ఇతర నాయకులు పాల్గొన్నారు.
Tags KCR KTR Telangana Vinayaka chavithi
Check Also
IPL 2024: ఐదు సార్లు ఛాంపియన్.. తొలి మ్యాచ్ లో 12 సార్లు ఓటమి! ముంబై తీరిదే!
IPL 2024: ఐదుసార్లు ఛాంపియన్ ముంబై ఇండియన్స్ ఐపీఎల్ సీజన్లో తొలి మ్యాచ్లో ఓడిపోయింది. ఈసారి ఆ జట్టు 2022 …
IPL 2024: ఐపీఎల్ ప్రారంభ వేడుక ఎలా ఉంటుందంటే..
IPL 2024 సీజన్ 17 సమీపిస్తోంది. ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ లీగ్ మరో రెండు రోజుల్లో ప్రారంభం కానుంది. ఇందులో …
AP Elections: నిబంధనలు అందరూ పాటించాల్సిందే.. ఎన్నికల ప్రధాన అధికారి
AP Elections: రాష్ట్రవ్యాప్తంగా 144 సెక్షన్ అమలులో ఉందని ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. అమరావతిలో …