Thursday , 24 October 2024
Sri Leela in Vizag

Sri Leela in Vizag: అంగరంగ వైభవంగా ప్రారంభమైన ఏపీఎల్ – 2

వైజాగ్ వేదికగా ఏపీఎల్ సీజన్ – 2 బుధ వారం వైభవంగా ప్రారంభమైంది. సినీ హీరోయిన్ శ్రీ లీల(Sri Leela in Vizag) గౌరవ అతి థిగా హాజరై క్రీడాకారుల్లో ఉత్సా హాన్ని నింపారు. అనంతరం ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు పి. శరత్ చంద్రారెడ్డి  మాట్లాడుతూ యువతలో దాగి ఉన్న ప్రతిభను బయటకు తీయడం కోసం బిసిసిఐ సహకారంతో ఏపీఎల్ సీజన్ – 2 నిర్వహిస్తున్నామని తెలిపారు. ఏపీఎల్ నిర్వహణ వల్ల రాష్ట్రానికి చెందిన క్రికెటర్లు జాతీయ, అంత ర్జాతీయ(Sri Leela in Vizag) స్థాయిలో ఆడే అవకాశం లభిస్తుందన్నారు. మంత్రి గుడివా డ అమర్నాథ్ మాట్లాడుతూ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి క్రీడాభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటు న్నారని తెలిపారు. అక్టోబర్ 2వ తేదీ నుంచి ఆడుదాం ఆంధ్ర అనే పేరుతో అన్ని రకాల క్రీడల్లో గ్రామ స్థాయిలో ప్రతిభ ఉన్న వారిని గుర్తించి ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. విడిసీ ఏ అధ్యక్షులు విష్ణు కుమార్ రాజు మాట్లాడుతూ ఏపీఎల్ ద్వారా ఏసీఏ అధ్యక్షులు పి.శరత్ చంద్రారెడ్డి యువ క్రీడాకారులను ప్రపంచానికి తెలియచేసేందుకు అవకాశం కల్పించారని అన్నారు. ఈ కార్యక్రమంలో(Sri Leela in Vizag) జివిఎంసి మేయర్ జి. హరి వెంకట కుమారి, ఏపీఎల్ గవెర్నింగ్ కౌన్సిల్ చైర్మన్ మాంచు పెర్రర్, ఏసీఏ కార్యదర్శి ఎస్.ఆర్. గోపీనాథ్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ రోహిత్ రెడ్డి, ట్రెజరర్ వెంకట చలం, సీఈవో వెంకట శివా రెడ్డి, ఏపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ మెంబర్లు మునిష్ సెహగల్, జి.వి.వి. గోపాల్ రాజు, ఎంపీ ఎం.వి.వి. సత్యనారాయణ, ఏమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాస్ రావ్, కలెక్టర్ ఎ. మల్లికార్జున పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి:

https://visheshalu.com/2023/06/07/mega-star-chiranjeevi-about-adipurush-prabhas-reveals-the-chiru-words/

also check this web site for latest news

Check Also

Union Budget 2024

Union Budget 2024: కేంద్ర బడ్జెట్ ఈనెల 24 న.. షెడ్యూల్ ఇదే!

Union Budget 2024: మోడీ 3.0 ప్రభుత్వం మొదటి బడ్జెట్‌ను జూలై 24న సమర్పించవచ్చని రిపోర్ట్స్ చెబుతున్నాయి. వర్షాకాల సమావేశాలు జూలై 22న ప్రారంభం కానున్నాయి. ఆర్థిక సర్వే నివేదికను జూలై 23న పార్లమెంటు కు సమర్పించనున్నారు.

India vs Zimbabwe T20

India vs Zimbabwe T20: టీమిండియా-జింబాబ్వే టీ20 సిరీస్ ఈరోజే ప్రారంభం

భారత్-జింబాబ్వే (భారత్ వర్సెస్ జింబాబ్వే) మధ్య నేటి నుంచి టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ హరారేలోని స్పోర్ట్స్ క్లబ్ గ్రౌండ్‌లో జరగనుంది. భారత కాలమానం ప్రకారం సాయంత్రం 4.30 గంటలకు ప్రారంభమవుతుంది.

Euro Cup 2024

Euro Cup 2024: యూరో కప్ లో సెమీస్ కు ఫ్రాన్స్.. రోనాల్డో కల తీరలేదు..

జర్మనీ వేదికగా జరుగుతున్న యూరో కప్ (యూరో కప్ 2024) క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో పోర్చుగల్‌పై ఫ్రాన్స్ జట్టు విజయం సాధించింది . ఈ విజయంతో ఫ్రాన్స్ సెమీఫైనల్‌కు చేరుకోగా, క్రిస్టియానో ​​రొనాల్డో నేతృత్వంలోని పోర్చుగల్ జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించింది. హాంబర్గ్‌లోని వోక్స్‌పార్క్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో ఉత్కంఠ పోరు సాగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *