గణనాధుని పండగ ఉత్సాహంగా జరుపుకుంటున్నారు తెలుగు ప్రజలు. ఈసారి వినాయకచవితి తిథి విషయంలో గందరగోళం ఉండడంతో సోమవారం, మంగళవారం కూడా వినాయకచవితి ఉత్సవాలు జరగనున్నాయి. చాలా ప్రాంతాల్లో సోమవారం సాయంత్రమే వినాయకుడు కొలువుతీరాడు. ముఖ్యంగా తెలంగాణాలోని చాలా ప్రాంతాలలో సోమవారం పండగ చేసుకున్నారు. ఈ నేపధ్యంలో సీఎం కేసీఆర్ (CM KCR) దంపతులు ప్రగతి భవన్ లో వినాయకచవితి పూజలు నిర్వహించారు. సోమవారం ఉదయమే జరిగిన పూజల్లో సీఎం దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలందరికీ వినాయకచవితి శుభాకాంక్షలు తెలిపారు సీఎం కేసీఆర్. విఘ్నేశ్వరుడు రాష్ట్ర ప్రజలను చల్లగా చూడాలనీ.. అందరికీ సుఖశాంతులు కాలగాలనీ ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ దంపతులు, వారి కూతురు అలేఖ్యలతో పాటు మంత్రి శీనివాస్ గౌడ్, ఎమ్మెల్సీ రాజేశ్వర్ రెడ్డి ఇతర నాయకులు పాల్గొన్నారు.
Tags KCR KTR Telangana Vinayaka chavithi
Check Also
AP Elections: నిబంధనలు అందరూ పాటించాల్సిందే.. ఎన్నికల ప్రధాన అధికారి
AP Elections: రాష్ట్రవ్యాప్తంగా 144 సెక్షన్ అమలులో ఉందని ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. అమరావతిలో …
డిసెంబర్ లో జీఎస్టీ వసూళ్లు అదిరిపోయాయి.. ఎంతంటే..
డిసెంబర్-2023లో ప్రభుత్వం గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ అంటే GST నుండి దాదాపు రూ.1.65 లక్షల కోట్లు వసూలు చేసింది. …
world cup cricket: వామ్మో ఇదేం దంచుడురా బాబూ.. సౌతాఫ్రికా టీంకి పూనకం..
ఒకటా.. రెండా.. రికార్డుల వర్షం.. వరల్డ్ కప్ క్రికెట్ అంటేనే ఉండే మజా వేరు. భారత్ వేదికగా జరుగుతున్న వరల్డ్ …