Site icon Visheshalu

IPL 2024: ఐదు సార్లు ఛాంపియన్.. తొలి మ్యాచ్ లో 12 సార్లు ఓటమి! ముంబై తీరిదే!

IPL 2024 Mumbai Indians vs Gujarat Titans

IPL 2024: ఐదుసార్లు ఛాంపియన్ ముంబై ఇండియన్స్ ఐపీఎల్ సీజన్‌లో తొలి మ్యాచ్‌లో ఓడిపోయింది. ఈసారి ఆ జట్టు 2022 చాంపియన్ గుజరాత్ టైటాన్స్ చేతిలో 6 పరుగుల తేడాతో ఓడిపోయింది. 2012 తర్వాత నుంచి టోర్నీలో తొలి మ్యాచ్‌లో విజయం కోసం ముంబై ఎదురుచూస్తోంది. చివరిసారిగా టోర్నీలో తన తొలి మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్‌ను ఓడించింది ముంబై.

PL 2024: ఆదివారం రాత్రి అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ముంబై టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 168 పరుగులు చేసింది. అనంతరం ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 162 పరుగులు మాత్రమే చేయగలిగింది. సాయి సుదర్శన్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు. సాయి సుదర్శన్ 39 బంతుల్లో 45 పరుగులిచ్చి ఒక వికెట్ తీశాడు.

ముంబై ఓటమికి కారణాలివే..

ఆ తర్వాత రోహిత్, బ్రూయిస్ ఔటయ్యారు. వీరిద్దరూ ఔటైన తర్వాత ఆ జట్టు ఇన్నింగ్స్‌ ఒక్కసారిగా కుప్పకూలింది. చివరి 6 మంది బ్యాట్స్‌మెన్ 25 పరుగులు కూడా జోడించలేని పరిస్థితి నెలకొంది. గుజరాత్‌ తరఫున అజ్మతుల్లా ఒమర్‌జాయ్‌, ఉమేష్‌ యాదవ్‌, స్పెన్సర్‌ జాన్సన్‌, మోహిత్‌ శర్మ చెరో 2 వికెట్లు తీశారు. సాయి సుదర్శన్‌కు ఒక వికెట్ దక్కింది.

Exit mobile version