Thursday , 18 April 2024
India vs Bangladesh 1st test 1st day match Highlights
India vs Bangladesh 1st test 1st day match Highlights

India Vs Bangladesh 1st Test: బంగ్లా బౌలర్ల ముందు.. టీమిండియా బ్యాటర్స్ తడబడుతూ.. నిలబడ్డారు..

వన్డే సిరీస్ కోల్పోయిన టీమిండియా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో(India Vs Bangladesh 1st Test) తొలి రోజు 6 వికెట్ల నష్టానికి 278 పరుగులు చేసింది. ప్రారంభంలో 3 వికెట్లు కోల్పోయిన టీమిండియా(Team India) మధ్యాహ్నం సెషన్ లో పుంజుకుంది. అయితే, సాయంత్రం ఆట ముగిసే సమయానికి, బంగ్లాదేశ్ బౌలర్లు ఛెతేశ్వర్ పుజారా .. అక్షర్ పటేల్‌లను అవుట్ చేసి తిరిగి టీమిండియాకు సవాల్ విసిరారు.

ఛటోగ్రామ్‌లో (India Vs Bangladesh 1st Test) బుధవారం జరిగిన మ్యాచ్‌లో టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఆట ముగిసే సమయానికి 82 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద శ్రేయాస్ అయ్యర్ నాటౌట్‌గా నిలిచాడు. కాగా, మొదటి రోజు చివరి బంతికి అక్షర్ పటేల్ 14 పరుగులు చేసి అవుటయ్యాడు. అతను మెహదీ హసన్ మిరాజ్ చేతిలో ఎల్బీడబ్ల్యూ అయ్యాడు.

అక్షర్ కంటే ముందు టెస్టు స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్ ఛెతేశ్వర్ పుజారా(Pujaraa) (90) తైజుల్ ఇస్లాం బౌలింగ్‌లో ఔటయ్యాడు. పుజారా 51 ఇన్నింగ్స్‌ల్లో సెంచరీ చేయలేకపోయాడు. అంతకుముందు రిషబ్ పంత్ (46 పరుగులు), శుభమన్ గిల్ (20 పరుగులు), కెప్టెన్ కేఎల్ రాహుల్ (22 పరుగులు), విరాట్ కోహ్లీ (1 పరుగు) వికెట్లు కోల్పోయింది భారత్. బంగ్లాదేశ్ బౌలర్లలో తైజుల్ ఇస్లామ్ 3 వికెట్లు తీశాడు. మెహదీ హసన్ మిరాజ్ 2 వికెట్లు తీశాడు.

సెషన్ వారీగా తొలిరోజు మ్యాచ్ ఇలా..

తొలి సెషన్: బంగ్లాదేశ్ బౌలర్ల ఆధిపత్యం..
తొలి సెషన్‌లో ఆతిథ్య జట్టు (India Vs Bangladesh 1st Test) ఆటపై ఆధిపత్యం ప్రదర్శించింది. లంచ్ సమయానికి భారత్ 26 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 85 పరుగులు చేసింది. ఆ జట్టులోని టాప్-3 బ్యాట్స్‌మెన్‌ను అవుట్ అయి పెవిలియన్‌కు చేరుకున్నారు. కెప్టెన్ కేఎల్ రాహుల్ 22, శుభ్‌మన్ గిల్ 20, ఇన్నింగ్స్ ప్రారంభించేందుకు వచ్చిన విరాట్ కోహ్లీ 1 పరుగు చేసి ఔటయ్యారు. ఈ సెషన్‌లో బంగ్లాదేశ్‌ తరఫున తైజుల్ ఇస్లాం 2 వికెట్లు పడగొట్టాడు. ఖలీద్ అహ్మద్‌కు ఒక వికెట్ దక్కింది.

రెండో సెషన్: భారత బ్యాట్స్‌మెన్‌ల దూకుడు..
టీ విరామ సమయానికి భారత్ 4 వికెట్లకు 174 పరుగులు చేసింది. ఈ సెషన్‌లో (India Vs Bangladesh 1st Test) భారత బ్యాట్స్‌మెన్ పుంజుకున్నారు. స్కోర్ బోర్డ్ కు 89 పరుగులు జోడించారు. అయితే ఆ సమయంలో జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. 46 పరుగుల వద్ద రిషబ్ పంత్ అవుటయ్యాడు. లంచ్ తర్వాత భారత్ 85/3 స్కోరుతో ఆడడం ప్రారంభించింది.

మూడో సెషన్: బ్యాట్ బాల్ మధ్య పోరు..

చివరి ఓవర్‌లో పుజారా-అక్షర్‌ల వికెట్ పడిపోవడంతో సెషన్ ప్రారంభంలో శ్రేయాస్ అయ్యర్, పుజారా మంచి భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అయితే రోజు ఆట ముగిసే సమయానికి పుజారాను తైజుల్ ఇస్లాం .. అక్షర్ కు మెహదీ హసన్ మిరాజ్ పెవిలియన్ దారి చూపించారు.

టీమిండియా పార్టనర్ షిప్స్..

1. పుజారా-అయ్యర్: 5వ వికెట్‌కు 149 పరుగులు..

పుజారా శ్రేయాస్ అయ్యర్‌తో కలిసి 5వ వికెట్‌కు 149 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. పుజారా 34వ అర్ధ సెంచరీ నమోదు చేశాడు. కాగా శ్రేయాస్ అయ్యర్ రెండో సెంచరీకి చేరువలో ఉన్నాడు. నాలుగో టెస్టు హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

2. పంత్-పుజారా: నాలుగో వికెట్, 64 పరుగులు

రిషబ్ పంత్, ఛెతేశ్వర్ పుజారా నాలుగో వికెట్‌కు 64 పరుగుల భాగస్వామ్యం (India Vs Bangladesh 1st Test) నెలకొల్పారు. 48 పరుగుల వద్ద మూడు వికెట్లు కోల్పోయిన తర్వాత, ఇద్దరూ భారత ఇన్నింగ్స్‌ను నిర్వహించడానికి ప్రయత్నించి 112 పరుగులు చేశారు.

3. గిల్-రాహుల్: తొలి వికెట్, 41 పరుగులు
కెప్టెన్ KL రాహుల్ .. శుభ్‌మన్ గిల్ 41 పరుగుల భాగస్వామ్యాన్ని భాగస్వామ్యం చేసి భారత ఇన్నింగ్స్‌ను ప్రారంభించారు. ఇద్దరూ సులువుగా పరుగులు సాధించారు.

టీమ్స్  ఫైనల్ 11..

భారత్: కేఎల్ రాహుల్ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, ఛెతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, ఉమేష్ యాదవ్, మహ్మద్ సిరాజ్.

బంగ్లాదేశ్: జకీర్ హసన్, నజ్ముల్ హసన్ శాంటో, యాసిర్ అలీ, ముష్ఫికర్ రహీమ్, షకీబ్ అల్ హసన్ (కెప్టెన్), లిటన్ దాస్, నూరుల్ హసన్, మెహిదీ హసన్ మిరాజ్, తైజుల్ ఇస్లాం, ఖలీద్ అహ్మద్ .. ఇబాదత్ హొస్సేన్.

గెలిస్తే డబ్ల్యూటీసీలో భారత్ మూడో స్థానానికి చేరుకుంటుంది

ఈ మ్యాచ్ గెలిస్తే ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ (డబ్ల్యూటీసీ)లో భారత్ 55.76% పాయింట్లను పొందుతుంది. అప్పుడు టీమిండియా శ్రీలంకను అధిగమించి పాయింట్ల పట్టికలో మూడో ర్యాంక్‌కు చేరుకుంటుంది. ప్రస్తుతం శ్రీలంక 53.33% పాయింట్లతో ఉంది. 75% పాయింట్లతో ఆస్ట్రేలియా మొదటి స్థానంలో, 60% పాయింట్లతో దక్షిణాఫ్రికా రెండో స్థానంలో ఉన్నాయి. మ్యాచ్ ఓడిపోయినా.. డ్రా అయితే భారత్ నాలుగో ర్యాంకులోనే కొనసాగుతుంది.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి!

Check Also

ap elections

AP Elections: నిబంధనలు అందరూ పాటించాల్సిందే.. ఎన్నికల ప్రధాన అధికారి

AP Elections: రాష్ట్రవ్యాప్తంగా 144 సెక్షన్ అమలులో ఉందని ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. అమరావతిలో …

GST December

డిసెంబర్ లో జీఎస్టీ వసూళ్లు అదిరిపోయాయి.. ఎంతంటే..

డిసెంబర్-2023లో ప్రభుత్వం గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ అంటే GST నుండి దాదాపు రూ.1.65 లక్షల కోట్లు వసూలు చేసింది. …

world cup 2023 SA vs Srilanka

world cup cricket: వామ్మో ఇదేం దంచుడురా బాబూ.. సౌతాఫ్రికా టీంకి పూనకం..

ఒకటా.. రెండా.. రికార్డుల వర్షం.. వరల్డ్ కప్ క్రికెట్ అంటేనే ఉండే మజా వేరు. భారత్ వేదికగా జరుగుతున్న వరల్డ్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *