Tuesday , 23 April 2024
Gujarat Election Results 2022 BJP Record Victory
Gujarat Election Results 2022 BJP Record Victory

Gujarat Election Results 2022: ఆప్ దూకుడు.. కాంగ్రెస్ కుమ్ములాటలు.. మోడీ ప్రభంజనం.. బీజేపీ ఘన విజయానికి 9 కారణాలు..

ఎన్నికల్లో విజయం సాధించడం.. ఒక రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి బంపర్ మెజార్టీతో గెలవడం(Gujarat Election Results 2022) అంటే మామూలు విషయం కాదు. అదికూడా వరుసగా ఏడోసారి రికార్డు స్థాయిలో ఓట్లు.. సీట్లు సాధించడం అంటే దానిని ఘన విజయం అనే మాటతో కూడా చెప్పడం కూడా సాధారణంగా చెప్పడంలా అయిపోతుంది. ఇది గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ సాధించిన అపూర్వ విజయం. ఈ విజయం వెనుక ఎంతో ప్లానింగ్ ఉంది. ప్రభుత్వ వ్యతిరేకత.. ప్రతిపక్షాల సవాళ్ళను ఎదుర్కోవడానికి బీజేపీ నాయకత్వం చేసిన అద్భుతమైన కృషి ఉంది. అసలు బీజేపీ గుజరాత్ ఎన్నికల విషయంలో ఎటువంటి వ్యూహాలను పన్నింది.. ఎలా వాటిని అమలు చేసింది అనే అంశాలను పరిశీలిద్దాం.

గత ఎన్నికల్లో అంటే 2017 లో బీజేపీ కేవలం 99 సీట్లకే పరిమితమైంది. అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా 100లోపు సీట్లు వచ్చాయి. దీంతో నాయకత్వం గుణపాఠం తీసుకుని 2022లో విజయం సాధించేందుకు (Gujarat Election Results 2022) ఏడాదిన్నర క్రితమే సన్నాహాలు ప్రారంభించింది. ఎన్నికలకు వారం రోజుల ముందు హోంమంత్రి అమిత్ షా బూత్ స్థాయిలో జరుగుతున్న సన్నాహాల గురించి రోజువారీ అభిప్రాయాన్ని తీసుకోవడం ప్రారంభించారు.

ప్రతి రోజూ బూత్ స్థాయి సమావేశాలు నిర్వహించారు. ప్రచారాన్ని సమీక్షించారు. ర్యాలీకి ఎంపిక చేసిన స్థలాలు, ఎందుకు ఎంపిక చేశారనే దానిపై కూడా షా వివరంగా చర్చించారు. ఈయన సమావేశాలు గంటల తరబడి సాగేవని పార్టీ నేతలు చెబుతున్నారు. కేంద్రమంత్రులు, ముఖ్యమంత్రులు, సీనియర్ నేతలను వివిధ ప్రాంతాలకు పంపించారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ ప్రచారానికి అగ్రస్థానంలో నిలిచారు.

ప్రధాని మోడీ 31 ర్యాలీలు, 3 రోడ్‌షోలతో పాటు, ఎన్నికలకు ముందు బిజెపి కూడా అనేక ప్రయోగాలు చేసింది, అవి విజయవంతమయ్యాయి.

రికార్డు విజయానికి బాటలు వేసిన ఆ నిర్ణయాలు…

1. ఎన్నికలకు ఒక సంవత్సరం ముందు మొత్తం ప్రభుత్వం మారిపోయింది:

అసెంబ్లీ ఎన్నికలకు ఒక సంవత్సరం ముందు, గుజరాత్‌లో ముఖ్యమంత్రి విజయ్ రూపానీతో సహా మొత్తం మంత్రివర్గాన్ని బిజెపి మార్చింది. రూపానీ స్థానంలో తొలిసారి ఎమ్మెల్యే అయిన భూపేంద్ర పటేల్‌ను ముఖ్యమంత్రిని చేశారు. నో రిపీట్ ఫార్ములా కింద పాత మంత్రులకు కొత్త మంత్రివర్గంలో చోటు కల్పించలేదు. ముఖ్యమంత్రినే కాదు, అసెంబ్లీ స్పీకర్‌ను కూడా మార్చారు.

భారత రాజకీయాల్లో తొలిసారిగా బీజేపీ గుజరాత్‌లోనే ఇలాంటి ప్రయోగం చేసి ఇప్పుడు పూర్తిగా సక్సెస్(Gujarat Election Results 2022)  అయినట్లే. మొత్తం ప్రభుత్వాన్ని మార్చడం ద్వారా బిజెపి అధికార వ్యతిరేక వేవ్ ను పూర్తిగా అంతం చేసిందని చెప్పవచ్చు. కొత్త కేబినెట్‌లో కుల, ప్రాంతీయ సమీకరణాలను నిర్వహించేందుకు ప్రయత్నించారు.

కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరిన ముగ్గురు నేతలకు మంత్రివర్గంలో చోటు కల్పించారు. పటీదార్ వర్గాన్ని ప్రసన్నం చేసుకునేందుకు ముఖ్యమంత్రితోపాటు పటేల్ సామాజికవర్గానికి చెందిన అత్యధిక ఎమ్మెల్యేలకు మంత్రివర్గంలో చోటు దక్కింది.

కోవిడ్ తర్వాత గుజరాత్‌లో ఇదే తొలి ఎన్నికలు. కోవిడ్ సమయంలో ప్రభుత్వం నిర్వహణ లోపం కారణంగా అనేక విమర్శలు వచ్చాయి. ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రూపానీ ప్రభుత్వం స్థానంలో బీజేపీ కొత్త నాయకత్వాన్ని అధికారంలోకి తీసుకురావడంతో ఈ ఆగ్రహం చల్లారిపోయింది.

2. రూపానీ.. నితిన్ పటేల్‌తో సహా చాలా మంది పెద్ద నాయకులకు సెలవు:

గ్రౌండ్ నుంఛి వచ్చిన ఫీడ్‌బ్యాక్ ఆధారంగా, బిజెపి కూడా పెద్ద నాయకుల టిక్కెట్లను(Gujarat Election Results 2022)  తగ్గించే రిస్క్ తీసుకుంది. మెహసానా నుంచి నితిన్ పటేల్ టికెట్ క్యాన్సిల్ అయింది. అలాగే 2016 ఆగస్టు నుంచి 2021 సెప్టెంబర్ వరకు సీఎంగా ఉన్న విజయ్ రూపానీ టికెట్ కూడా రద్దయింది. రూపానీ 1987 నుంచి రాజ్‌కోట్ రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్నారు. బీజేపీ గుజరాత్ యూనిట్ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. విశేషమేమిటంటే.. ఈ ఇద్దరు నేతలు స్వయంగా మీడియాలోకి వచ్చి ఎన్నికల్లో పోటీ చేయడం తమకు ఇష్టం లేదని చెప్పడం. దీని ద్వారా ప్రజల్లో కూడా ఏ మాత్రం అలజడి రాలేదు.

3. గెలిచే సత్తా మాత్రమే టికెట్లకు ప్రాధాన్యత:

గుజరాత్‌లో గెలుపు ఆధారంగా బీజేపీ టిక్కెట్లు ఇచ్చింది. 42 మంది ఎమ్మెల్యేల టిక్కెట్లు కట్‌ అయ్యాయి. 2017లో కాంగ్రెస్‌ టికెట్‌పై పోటీ చేసిన అభ్యర్థులకు అవకాశం కల్పించారు. పనితీరు జాబితాలో 80% కంటే తక్కువ మార్కులు పొందిన 25% మంది ఎమ్మెల్యేలకు పార్టీ టిక్కెట్లు నిరాకరించిందని పార్టీ వర్గాలు తెలిపాయి. కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వచ్చిన నేతలకు టికెట్లు ఇచ్చి చేసిన సాహసం కూడా ఫలించింది.

4. 2017లో బీజేపీ ఓడిపోయిన చోటే మొదటగా ప్రచారం మొదలైంది:

2017లో మోర్బి, సురేంద్రనగర్, అమ్రేలి వంటి బీజేపీ ఓడిపోయిన స్థానాల్లో ఈసారి చాలా ముందుగానే ప్రచారం మొదలైంది. సౌరాష్ట్రలో ఎన్నికలకు ఆరు నెలల ముందే బీజేపీ ప్రచారం మొదలైంది. పార్టీ పన్నా ప్రముఖ్‌ను మళ్లీ కొత్తగా చేసింది. ప్రజల్లో ఆగ్రహం ఉన్న అలాంటి ఎమ్మెల్యేలను వదిలేశారు. 2017లో బీజేపీ కష్టాలు ఎదుర్కొన్న సీట్లను ప్రధాని మోదీ, అమిత్ షా కవర్ చేశారు.

5. మంత్రుల టిక్కెట్లను తగ్గించడానికి కూడా వెనుకాడలేదు:

సెప్టెంబర్ 2021లో, బిజెపి నాయకత్వం గుజరాత్ మొత్తం ప్రభుత్వాన్ని(Gujarat Election Results 2022)  మార్చింది, ఆ సమయంలో మొత్తం 24 మంది మంత్రులను నియమించారు. వీరిలో 10 మంది కేబినెట్‌, 14 మంది రాష్ట్ర మంత్రులు. ఈ ఎన్నికల్లో ఆ పార్టీ ఐదుగురు మంత్రుల టిక్కెట్లను తగ్గించింది. టిక్కెట్లు పొందిన వారిలో 19 మంది మంత్రులు గెలిచారు. ఒక్కరు మాత్రమే ఓడిపోయారు. మంత్రివర్గాన్ని మార్చడం, కొత్త మంత్రులను చేయడం బీజేపీకి సరైనదని ఫలితాలు చెబుతున్నాయి.

6. తిరుగుబాటుదారుల విషయంలో కఠినంగా వ్యవహరించడం:

పెద్ద నాయకుల టిక్కెట్లు తగ్గించిన తర్వాత కూడా, క్షేత్రస్థాయిలో BJP దుర్వినియోగం కనిపించలేదు. ఎవరైనా తిరుగుబాటుకు ప్రయత్నిస్తే కఠిన చర్యలు తీసుకున్నారు. ఎన్నికల మధ్యలో, పార్టీ అభ్యర్థిపై స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్ వేసిన 12 మంది నాయకులను బిజెపి సస్పెండ్(Gujarat Election Results 2022)  చేసింది. నితిన్‌ పటేల్‌, విజయ్‌ రూపానీ వంటి పెద్ద నేతలకు టిక్కెట్లు నిరాకరించినా ఎవరూ తిరుగుబాటు చేసే సాహసం చేయలేకపోయారు.

7. ‘నేను గుజరాత్ కుమారుడిని’ విజయానికి పెద్ద స్లోగన్ అయింది..

‘నేను గుజరాత్ కొడుకును’ అని నరేంద్ర మోడీ చేసిన ప్రచారం ఈ ఎన్నికల్లో బిజెపి విజయానికి పెద్ద కారణమైంది. ఇదే విషయాన్ని ఆయన గుజరాత్‌లో పదేపదే చెప్పారు. మోడీ చేసిన ఈ ప్రచారం గుజరాత్ ఓటర్ల అభిప్రాయాన్ని ఒక్కసారిగా బీజేపీ వైపు తిప్పేసింది.

8. కాంగ్రెస్ కు ఆప్ దెబ్బ:

ఇక విపక్షాల గురించి చెప్పుకోవడానికి పెద్దగా ఏమీలేదు. అందరూ ఊహించినట్లే కాంగ్రెస్ పార్టీని ఆప్ గట్టి దెబ్బ కొట్టింది. ఆమ్ ఆద్మీ పార్టీ నేరుగా కాంగ్రెస్‌ను దెబ్బతీసింది. సౌరాష్ట్ర, దక్షిణ గుజరాత్‌లలో కాంగ్రెస్ బలంగానే ఉంది. కానీ ఈసారి ఆప్ చేతిలో ఘోరంగా దెబ్బతింది. ఆప్ ఇచ్చిన గట్టిపోటీతో బీజేపీ ప్రత్యక్షంగా లబ్ధి పొందింది.

9. కాంగ్రెస్ స్వయంకృతాపరాధం:

బీజేపీ విజయానికి కారణం కాంగ్రెస్సే. కాంగ్రెస్ సీనియర్ నాయకత్వం గుజరాత్‌ను పూర్తిగా వదులుకుందని(Gujarat Election Results 2022)  అక్కడి విశ్లేషకులు అంటున్నారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేశాడు, కానీ గుజరాత్‌ను పూర్తిగా విస్మరించారని.. అది కూడా పెద్ద స్థాయిలో కాంగ్రెస్ ఓటమికి బాటలు వేసిందని ఆ వర్గాలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి.

ఎన్నికలకు రెండు నెలల ముందు కాంగ్రెస్‌ సభ్యులు తమ అధ్యక్షుని ఎన్నుకోవడంలో.. పార్టీ రాజకీయాల్లో బిజీబిజీగా ఉన్నారు. ఆ సమస్యకు ఒక పరిష్కారం వచ్చే సమైయంలో.. జాతీయ పరిశీలకుడు అశోక్ గెహ్లాట్, గుజరాత్ ఇన్‌ఛార్జ్ రఘు శర్మ ఇద్దరి దృష్టి రాజస్థాన్‌పైనే ఉంది, ఎందుకంటే ఇద్దరూ రాజస్థాన్‌కు చెందినవారు. గర్బా సమయానికి ప్రియాంక గాంధీ రావాల్సి ఉంది, కానీ ఆమె రాలేదు. రాహుల్ గాంధీ వచ్చారు, కానీ ఆలస్యంగా వచ్చారు.

రెండవది, కాంగ్రెస్‌కు చెందిన ప్రతి అభ్యర్థి తన సొంత బలంతో ఒంటరిగా పోరాడారు. కేంద్ర నాయకత్వం నుంఛి ఎటువంటి ప్రచారం లేదా వనరుల మద్దతు లేదు. గుజరాత్ కాంగ్రెస్ నాయకత్వంలో అరడజను మంది సిఎం అభ్యర్థులు ఉన్నారు, వారు తమ స్థానాలను కూడా కాపాడుకోలేకపోయారు. ఓడిపోయినా ముఖ్యమంత్రి కావాల్సిందే అన్న విధంగా వారు వ్యవహరించారు. టిక్కెట్ల ఎంపికలో వారి పాత్ర కూడా పెద్దదే. ఈ అంతర్గత కుమ్ములాటలు భారీ డేమీజీ చేయడమే కాకుండా బీజేపీకి రికార్డు స్థాయి విజయాన్ని అందించాయి. ఇక అక్కడ గిరిజనులు కాంగ్రెస్‌కు బలమైన ఓటర్లుగా ఇంతవరకూ ఉంటూ వచ్చారు. ఈసారి వారిని కూడా కాంగ్రెస్ పార్టీ హ్యాండిల్ చేయలేకపోయింది.

Also Read:

Gujarat Exit Polls: గుజరాత్ లో మళ్ళీ బీజేపీ.. హిమాచల్ లో హోరాహోరీ.. ఎగ్జిట్ ఫలితాల అంచనా

Check Also

ap elections

AP Elections: నిబంధనలు అందరూ పాటించాల్సిందే.. ఎన్నికల ప్రధాన అధికారి

AP Elections: రాష్ట్రవ్యాప్తంగా 144 సెక్షన్ అమలులో ఉందని ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. అమరావతిలో …

GST December

డిసెంబర్ లో జీఎస్టీ వసూళ్లు అదిరిపోయాయి.. ఎంతంటే..

డిసెంబర్-2023లో ప్రభుత్వం గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ అంటే GST నుండి దాదాపు రూ.1.65 లక్షల కోట్లు వసూలు చేసింది. …

world cup 2023 SA vs Srilanka

world cup cricket: వామ్మో ఇదేం దంచుడురా బాబూ.. సౌతాఫ్రికా టీంకి పూనకం..

ఒకటా.. రెండా.. రికార్డుల వర్షం.. వరల్డ్ కప్ క్రికెట్ అంటేనే ఉండే మజా వేరు. భారత్ వేదికగా జరుగుతున్న వరల్డ్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *